33.7 C
Hyderabad
April 29, 2024 23: 36 PM
Slider హైదరాబాద్

ప్రధాని మోడీ సీఎం కేసీఆర్…. ఇద్దరూ తోడుదొంగలే

#Revanthreddy

ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే అని, ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.చిన్నారెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన టీఆర్ ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ కేసీఆర్ మెడలు వంచడానికే చిన్నారెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపిందన్నారు.

కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఢిల్లీకి కలిసి వెళ్లి జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దాం రా అని సవాల్ విసిరారు.

బీజేపీ, టీఆర్ ఎస్ కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి.

వాగ్దానాలు తప్పా చేసింది ఏమీ లేదని విమర్శించారు.

Related posts

సరళా సాగర్ ప్రాజెక్టుకు భారీ గండి

Satyam NEWS

బాదితులకు సత్వర న్యాయం చేయాలి

Bhavani

తాలూక స్థాయి  క్రికెట్ కార్క్ బాల్ క్రికెట్ టోర్నీ విజేతగా కుడికిళ్ళ టీం

Satyam NEWS

Leave a Comment