26.7 C
Hyderabad
May 3, 2024 08: 10 AM
Slider కడప

శాడ్: ఆర్టీసీ బస్సుకు ఢీకొని యువకుడు మృతి

road accedent

బుల్లెట్ వాహనం పై వస్తూ  ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బుల్లెట్ నడుపుతున్నఒక యువకుడు తీవ్ర గాయాలపాలై మరణించాడు. కడపజిల్లా రాజంపేట మండలం పరిధిలోని మందరం కొత్తపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాజంపేట నుండి మందిరం కొత్త పల్లె కు చెందిన రామ్ రెడ్డి గారి మహేష్ రెడ్డి( 27) బుల్లెట్ వాహనం పై శనివారం రాత్రి వస్తూ ఎదురుగా హత్యరాల పుణ్య క్షేత్రం నుంచి రాజంపేట కు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొన్నాడు.

ఈ సంఘటనలో మహేష్ కు తలకు, పొట్ట భాగం లో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి ప్రాధమిక చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతి కి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు శోక సంద్రం లో మునిగి పోయారు. బాధితుడి కుటుంబాన్ని వైసీపీ నేత తంబెల్ల వేణుగోపాల్ రెడ్డి పరామర్శించారు.

Related posts

ములుగు జిల్లా టీచర్ బదిలీలకు మార్గదర్శకాలు

Satyam NEWS

వివేకా హత్యకేసులో ఇక ప్రముఖుల విచారణ షురూ

Satyam NEWS

పిల్లలు ఆడుకునేందుకు.. పెద్దలు వ్యాయామం చేసేందుకు పార్కులు

Satyam NEWS

Leave a Comment