అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి కడప వైపు వస్తున్న బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటన లో 5 గురు మృతి చెందగా,12 మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.మృతుల్లో కడపకు చెందిన కమల్ బాషా(65), పుల్లంపేట మండలం వెంకట రాజంపేట చెందిన కె.శేఖర్(55), ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు కు చెందిన జి.శ్రీనివాసులు(60),చిట్వేల్ కు చెందిన అమరనాధ రెడ్డి(35), నందలూరు మండలం ఆడపూరు కు చెందిన లక్షుమయ్య (70) అనే వృద్ధుడు తో కలిపి ఐదుగురు మృతి చెందారు.
ప్రమాదం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.సీఎం ఆదేశాల మేరకు ప్రమాదంలో మృతి చెందిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా, స్వల్పంగా గాయపడ్డ వారికి 50 వేల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష వెల్లడించారు.రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ ఆర్టీసీ వారి తరఫున ఉచితంగా వైద్యం చేయనున్నారు.కాగా క్షతగాత్రులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి లో చికిత్స పొందుతున్నారు.