రోడ్డు డివైడర్ ను కారు ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించిన దుర్ఘటన జనగాం జిల్లాలో జరిగింది. రఘునాథపల్లి మండలం కోమళ్ళ గ్రామం లోతువాగు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు కోమల్ల వద్ద డివైడర్ ను ఢీకొంది.
దాంతో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని పలివెల్పుల గ్రామానికి చెందిన వ్యాపారి చింతల రమేష్ బాబు ( 45) సంఘటన స్థలంలోనే మరణించగా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన బానోత్ రమేష్ ( డ్రైవర్) (25) జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రఘునాథ్ పల్లి ఎస్ఐ కేస్ నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.