నూతనంగా ఏర్పడ్డ ములుగు జిల్లాలో దినదినం ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రజల అవసరాల కోసం ఏర్పాటుచేసిన మహాలక్ష్మి డోర్స్ అండ్ విండోస్ దుకాణాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు సిఐ మేకల రంజిత్ కుమార్ తెలిపారు. పీఎంఈజీపి పథకం కింద నర్సంపేట కెనరా బ్యాంకు సహకారంతో మాలోత్ సాయికుమార్, బానోత్ బద్రు లు ఏర్పాటు చేసిన మహాలక్ష్మి డోర్స్ అండ్ విండోస్ షాపును సీఐ శుక్రవారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన అమలులో అనేకమంది వ్యాపారులు ఉద్యోగులు సిద్ధపడుతున్నారని దానికి అనుగుణంగా నూతన గృహాలను నిర్మించుకుంటున్నారని అలాంటి వారికి తక్కువ ధరలో నాణ్యమైన డోర్లు, కిటికీలు ఇతర వస్తువులను అందించాలని ఆయన సూచించారు. దాని ద్వారా ఇక్కడి ప్రజలకు అందుబాటులో గృహ నిర్మాణానికి అవసరపడే వసూలు దొరకడం చాలామందికి ఉపాధి కలుగుతుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.