కడప జిల్లా రాజంపేట పట్టణ శివార్లలోని ఊటుకూరు పంట పొలాల్లోమహిళను గుర్తు తెలియని వ్యక్తులు బండ రాయి తో కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, పట్టణ సిఐ శుభకుమార్, ఎస్సై ప్రతాప్ రెడ్డి తమ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు .ఘటన జరిగిన చోట ఇంటికి సంబంధించిన చిల్లర సామాన్లు చిందర వందరగా పడిఉన్నాయి.
నిన్న మృతురాలిని బండ రాయితో కొట్టి చంపివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇదే విషయంమై డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ మహిళ మృతికి గల కారణాలపై ఆరా దీస్తున్నామని, క్లూస్ బృందాలు రానున్నాయని, ఎవరైనా మహిళ కనిపించక పోతే వారి బంధువులు సంప్రదించాలని కోరారు. మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.