పెళ్లి వాహనం బోల్తా పడటంతో కొల్లాపూర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకున్నది. గద్వాల కు సంబంధించిన వ్యక్తులకు చెందిన పెళ్లి వాహనం రామాపురం దగ్గర బోల్తా పడింది.
నిర్మాణంలో ఉన్న వంద పడకల హాస్పిటల్ మలుపు దగ్గర పెళ్లి వారిని తీసుకువస్తున్న ఐషర్ వాహనం స్టిరింగ్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. పెళ్ళి వాహనంలో దాదాపు 20 మంది వరకూ ఉన్నట్లు అంచనా.
ప్రమాదం జరిగిన వెంటనే వెనుక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గమనించడంతో అక్కడ పెళ్లి వాహనంలో ఉండి ప్రమాదానికి గురి అయిన వారిని కొల్లా పూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
విషయం తెలిసిన వెంటనే కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి నరేందర్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి దెబ్బలు తగిలిన వాళ్ళను పరమర్శించి, వివరాలు కనుక్కున్నారు.
వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాల్సినదిగా సూచించారు. అంతకముందు అక్కడకు చేరుకున్న టీఆర్ఎస్ నాయకుడు రంగినేని అభిలాష్ రావు కొందరిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు.
కొల్లాపూర్ నియోజక పరిధిలోని రామాపురం కొల్లాపూర్ మధ్యలో పెళ్లి వాహనానికి ఈ ప్రమాదం జరిగినప్పుడు అప్పుడే అదే దారిలో వస్తున్న రంగినేనీ అభిలాష రావు చూశారు.
వెంటనే అక్కడ ఆగి సంబంధిత అధికారులతో మాట్లాడి అత్యవసర పరిస్థితుల్లో గాయాలైన వారిని బస్సులో లో తరలించేలా చేశారు.
మొత్తం 15 మంది కి గాయాలు అయ్యాయని కొల్లాపూర్ ఎసై కొంపల్లి మురళీ గౌడ్ తెలిపారు.