కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు.. లారీ ఢీకొని కండక్టర్ మృతి చెందగా ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాగా బస్సులో 8 మంది ప్రయాణికులున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ రోజు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన ఉండగా కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన కండక్టర్ కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లి కు చెందిన సత్తయ్య గా గుర్తించడం జరిగింది.