40.2 C
Hyderabad
April 28, 2024 17: 39 PM
Slider నిజామాబాద్

ఆదర్శప్రాయుడు సేవాలాల్ మహరాజ్: ఏవైఎస్

#sevalal

గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలల్ మహరాజ్ చిరస్మరణీయుడని ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో పరమపూజ్య సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 284వ జయంతి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సేవాలాల్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు కొనియాడారు.

గిరిజన జాతికే కాదు ఆయన అన్నివర్గాలకు ఆదర్శప్రాయుడన్నారు. ఆయన సూచించిన ఆధ్యాత్మిక బాటలో మనం నడవాల్సిన అవసరం ఉందన్నారు. మహనీయుల బాటలో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ అంతా ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారాస నాయకులు ఎజాస్, మల్లూరి సాయిలు, బుజ్జిగారి సాయిలు, దుర్కి బాలయ్య, గంగాధర్, సిపిఎం రవిందర్, బస్వయపల్లి కృష్ణ, మేకల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

దమ్ము లేని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కును కాపాడగలవా….?

Satyam NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం కృషి చేస్తా

Satyam NEWS

ఖమ్మం పోలీస్: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment