38.2 C
Hyderabad
April 29, 2024 12: 45 PM
Slider ఖమ్మం

పాపకు పట్టీలు కొనేందుకు వెళ్లి.. మృత్యువడిలోకి…

#roadaccident

పాపకు పట్టీలు కొనేందుకు వెళుతున్న ఆ తల్లికి ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలోని వినాయకపురం లో మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపాక గ్రామానికి చెందిన కూనసోతు విజయ్, లక్ష్మీ ప్రియ దంపతులు వారి పాప తో కలిసి అశ్వారావుపేట వెళ్తుండగా రాజమండ్రి నుండి భద్రాచలం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా తీవ్ర గాయాలపాలైన వారిని అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీ ప్రియ వైద్య ప్రయత్నాలకు ముందే మరణించింది. దీంతో భర్త విజయ్, చిన్న పాప,బంధువుల రోదనలతో ఆస్పత్రి ఏరియా మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

జగన్ ప్రత్యేక విమానంలో తిరిగితే తప్పులేదా?

Satyam NEWS

స్పందనకు పెరిగిన ఫిర్యాదు దారులు..ఈ సారి 34 మంది..!

Satyam NEWS

హైదరాబాద్‌లో జక్‌ జ్యువెల్స్‌ ఎక్స్‌పోను ప్రారంభించిన నటి శోభితా రానా

Satyam NEWS

Leave a Comment