జక్ జ్యువెల్స్ ఎక్స్పో 133వ ఎడిషన్ను హైదరాబాద్లో నేడు నటి శోభితా రానా ప్రారంభించారు. భారతదేశంలో ప్రత్యేకమైన బీ2సీ ఆభరణాల ప్రదర్శన ఇది. బంజారాహిల్స్లోని తాజ్కృష్ణా హోటల్లో ఈ ప్రదర్శన ఈ నెల 21వ తేదీ వరకూ జరుగనుంది.
ఈ ప్రదర్శన హైదరాబాద్కు తిరిగి రావడంతో పాటుగా తనతో పాటుగా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన 25 మంది ఆభరణాల వర్తకులకు ఒకే దరికి తీసుకువచ్చింది.
జక్ ట్రేడ్ ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సయ్యద్ జకీర్ అహ్మద్, జక్ ట్రేడ్ ఫెయిర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ కింబర్లీ ఫెర్నాండేజ్ ఈ ప్రదర్శన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కింబర్లీ మాట్లాడుతూ ‘‘దాదాపు ఓ దశాబ్దం తరువాత మేము హైదరాబాద్కు తిరిగి రావడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ప్రదర్శనలో అత్యంత సున్నితమైన మరియు అత్యుత్తమమైన డిజైన్లను ప్రదర్శించనున్నాం. త్వరలోనే మరో మారు ఇక్కడకు రాగలమని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.