38.2 C
Hyderabad
May 2, 2024 23: 01 PM
Slider విజయనగరం

ఆర్టీసీ జోన‌ల్ శిక్ష‌ణా కార్యాల‌యంలో రోడ్డు భ‌ద్ర‌తా వారోత్స‌వాలు…!

#roadseftey

విజ‌య‌న‌గ‌రం ఆర్టీసీ రీజియ‌న్ లో ని జోన‌ల్ స్టాఫ్ శిక్ష‌ణా క‌ళాశాల‌లో రోడ్డుభ‌ద్ర‌తావారోత్స‌వాలు జ‌రిగాయి. ఈ  వారోత్స‌వాల‌ను పోలీస్ శాఖ  ఓఎస్ డీ సూర్య చంద్ర‌రావు ప్రారంభించారు. జోనల్ ప‌రిధిలో మొత్తం 28 డిపోల నుంచీ 102 మంది సిబ్బంది ఈ భ‌ద్ర‌తా వారోత్స‌వాలకు హాజ‌ర‌య్యారు.ఏకాగ్ర‌త‌తో బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని,వేగాన్ని అద‌పులో ఉంచుకోవాల‌ని వ‌క్త‌లు సూచ‌న‌లు చేసారు.

అదే విధంగా రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా క‌నీస జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌న్నారు. ప్ర‌యాణీకుల‌తో  మ‌ర్యాద పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని,బ‌స్సు న‌డుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడ‌రాద‌ని హ‌చ్చ‌రించారు. అలాగే త‌ప్ప‌ని స‌రిగా రేపు డ్యూటీ అంటే ముందు  రోజు క‌చ్చితంగా విశ్రాంతి తీసుకోవాల‌ని ఆర్టీసీ ఆర్ఎం అప్ప‌ల‌రాజు సిబ్బందికి సూచించారు. రోడ్డు ప్ర‌మాదాల గురించి మోటార్ వెహిక‌ల్ చ‌ట్టం గురించి మోటార్ వెహిక‌ల్ ఇన్ స్పెక్ట‌ర్ బుచ్చిరాజు వివ‌రించారు.

ఇక రోడ్ ప్ర‌మాదాల నివార‌ణ గురించి…పోలీస్ శాఖ నుంచీ రూర‌ల్ సీఐ మంగ‌వేణి ప‌లు సూచ‌న‌లు తెలియ చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ అప్ప‌ల‌రాజు,డిప్యూటీ ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ త్రినాథ్ రావు,మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్ట‌ర్ బుచ్చురాజు,విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ సీఐ మంగ‌వేణిలు పాల్గొన్నారు.

Related posts

(Professional) Best Male Testosterone Product Where Can I Find Testosterone Pills Shopify Male Enhancement

Bhavani

సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఇక లేరు

Satyam NEWS

మందు బాబులను శాలువతో సన్మానించిన టీడీపీ నేత

Satyam NEWS

Leave a Comment