ఇచ్చిన మాట ప్రకారం వనపర్తి రహదారుల విస్తరణ చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి – బుద్దారం రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
కొత్తకోట, పెబ్బేరు, పాన్ గల్, బుద్దారం, గోపాల్ పేట రహదారుల విస్తరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. నాలుగు వరసల రహదారులతో పాటు, కరంటు, డ్రైనేజీలను ఆధునీకరించి, రోడ్ డివైడర్లు నిర్మిస్తామని ఆయన అన్నారు.
గత ఎన్నికల సంధర్భంగా రోడ్ల విస్తరణకు హామీ ఇచ్చాం .. వనపర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఅర్ ఈ విషయం ప్రకటించారు అదే విధంగా ఇప్పుడు పనులు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.
20 ఏళ్లుగా రోడ్ల విస్తరణ ప్రజలు కోరుతున్నారు. ఇరుకురోడ్లతో ప్రమాదాలు, రద్దీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దశాబ్దాల కల సాకారమవుతుంది అని మంత్రి వెల్లడించారు.
నష్టపోయిన వారిలో పేదలకు డబల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని వారు కోరారు .. ఖచ్చితంగా వారి కోరిక మేరకు ఇండ్లను అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.