గుంతలు పడిన రోడ్లను వెంటనే బాగుచేయలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో కడప నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లు వెంటనే బాగు చేయాలన్నారు. అలాగే వరద వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్పు పేరుతో అధికారం లోకి వచ్చిన వైసీపీ అభివృద్ధి లేక రాష్ట్రం అంధకారంలో ఉంచిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నమాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శశిభూషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఫ్లెక్సీలతో నిరసన తెలియజేశారు.
previous post