కెప్టెన్ గా విరాట్ కోహ్లి తన పదవి నుంచి వైదొలగడంపై భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. గత నెలలో భారత వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగిన కోహ్లి, టెస్టు ఫార్మాట్లోనూ అదే పని చేయాలని నిర్ణయించుకున్న విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలిసిందే. శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో విరాట్ కోహ్లి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వన్ డే, T20 ఫార్మాట్లలో కోహ్లి నుండి బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ ప్రస్తుతం గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు గాయం నుండి కోలుకున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లి నిర్ణయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి అనేక చిరస్మరణీయ విజయాలు అందించారని రోహిత్ శర్మ అన్నాడు. ఈ పరిణామంపై ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా స్పందించాడు. ‘కెప్టెన్గా జట్టుకు మీ సహకారం అమూల్యమైనది’ అని బుమ్రా తన పోస్ట్లో రాశాడు.
previous post