లాక్ డౌన్ లో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్ తో కలిసి ఆయన నేడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.