31.2 C
Hyderabad
May 3, 2024 02: 22 AM
Slider గుంటూరు

అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

#roundtable

పల్నాడు జిల్లా  నరసరావుపేట సీఐటీయూ కార్యాలయంలో గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు, కార్యదర్శి అనుముల లక్ష్మీ శ్వర రెడ్డి, రాష్ట్ర తెలుగురైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, ఎల్ఐసి ఏజెంట్ ఆర్గనైజేషన్ సి.ఐ.టి.యు. రాష్ట్ర అధ్యక్షులు ఇ.మస్తాన్ రెడ్డి, సమైక్యా ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం  జేఏసీ  రాష్ట్ర కన్వీనర్ ఎస్ కె. జిలాని మాలిక్, సి.ఐ.టి.యు రాష్ట్ర సభ్యులు గుంటూరు విజయ్ కుమార్, పల్నాడు జిల్లా యు టి ఎఫ్ అధ్యక్షురాలు భాగ్య శ్రీ దేవి, పల్నాడు జిల్లా శ్రామిక మహిళా సంఘం కన్వీనర్ డి శివ కుమారి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, సి.ఐ.టి.యు. డివిజన్ నాయకులు సిలార్ మసూద్, పట్టణ తెలుగుదేశం పార్టీ  ప్రధాన  కార్యదర్శి గూడూరు శేఖర్,  ఏ ఐ.టి.యు.సి. ఏరియా అధ్యక్షులు  ఉప్పలపాటి రంగయ్య  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే నిబంధనలు, పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టాలని, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో విద్య వైద్యం ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని,జాతీయ సంపదను కాపాడాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న  ప్రజా వ్యతిరేక  విధానాలపై అనేక అంశాలు  తెలియజేశారు  ఈనెల ఎనిమిదో తేదీన జిల్లా కలెక్టర్  వారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు

Related posts

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు కరోనా

Satyam NEWS

అల్లం సుదర్శన్ మృతి తీరని లోటు

Satyam NEWS

బంజారాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

Bhavani

Leave a Comment