జగన్మోహన్ రెడ్డికి నిజంగా విశాఖపట్నం పై అంత ప్రేమే ఉంటే నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఎక్కడో ఒక చోటి నుంచి పోటీ చేయాలని రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల వదిలి విశాఖ రావాలని ఆయన డిమాండ్ చేశారు. కావాలంటే తాను జగన్ పై పోటీకి తాను సిద్ధమేనని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. తాను విశాఖ నగరంలో పోటీ చేయడానికి కూటమి నేతలను టికెట్ అభ్యర్థించాల్సి ఉంటుందన్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరం లోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదు. ఆయనపై పోటీ చేసేందుకు నేను కూడా కూటమి నాయకులను టికెట్ అడగాల్సిన అవసరం వస్తుందనుకోవడం లేదని రఘురామకృష్ణం రాజు నవ్వుతూ తెలిపారు.
previous post