28.7 C
Hyderabad
April 27, 2024 05: 17 AM
Slider ఆదిలాబాద్

కొమరం భీం స్పూర్తితో ఆదివాసీలు ఉద్యమించాలి

#Kumaram Bheem

ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సేవా సంఘం అద్వర్యం లో బెజ్జుర్ మండల కేంద్రంలో  ఘనంగా కొమరం భీం 119 వ జయంతి  జరిపారు. ఈ సందర్బంగా  ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సేవా సంఘం మండల ప్రచార కార్యదర్శి పోల్క వెంకటేష్ మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం, అయన ఆదివాసీ సమాజానికి స్ఫూర్తి దాయకం అని కొనియాడారు. 

ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతం లోని భూమి అందులోని ఖనిజ సంపద, నీరు నీటిలోని  సంపద, అడవి అందులోని సంపద పై ఆదివాసీలకే హక్కు ఉంది అని అన్నారు. కానీ నేడు అభివృధి పేరుతో ఆదివాసీలను ప్రాజెక్టులు కడుతూ, గనులు తవ్వుతూ నిర్వాసితులుగా  మారుస్తున్నారని  ఆవేదన వ్యక్త పరిచారు.

గిరిజనేతరుల వలసలతో  ఏజెన్సీ జీవో లు చట్టాలు కనుమరుగైతున్నాయని అన్నారు. జీవో3 అమలుకై , 1/70  చట్టం పటిష్ట  అమలుకై సంస్కృతి పరిరక్షణకై కొమరం భీమ్ ల పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల అభివృద్ధి చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమించలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవీంద్ర నాయక్, జవిద్ అలీ, హన్మంతూ, కాంతయ్య, శంకర్, రాజేష్, లాలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రక్తం కారేలా కొట్టుకున్న కరణం, ఆమంచి అనుచరులు

Satyam NEWS

బిగ్ మిస్టేక్:కాంగ్రెస్ పార్టీని వీడేది కాకుండే

Satyam NEWS

అక్రమంగా ముందస్తు అరెస్టు పిరికిపంద చర్య

Satyam NEWS

Leave a Comment