39.2 C
Hyderabad
May 3, 2024 11: 54 AM
Slider ప్రత్యేకం

నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల ప్రారంభం

#rss

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను యావత్ ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా జరుపుకున్నామని ఆర్ ఎస్ ఎస్ కూకట్ పల్లి భాగ్ అధికారులు అన్నారు. దేశానికి ఆగష్టు 15, 1947 న స్వతంత్రం వచినప్పటికిని, నైజాం పాలిత ప్రాంతంలో, ఎంతోమంది త్యాగాల, పోరాటాల ఫలితంగా, 13 నెలల తరువాత, 17 సెప్టెంబర్ 1948 న భారత స్వాతంత్ర్య చిహ్నమైన త్రివర్ణ పతాకం ఎగురవేయడం తో బానిసత్వ చీకట్లు తొలిగించికొని స్వతంత్ర్య భారతం లో విలీనం అయిందని వారు వివరించారు.

విలీనం కాబడి 2023 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భం లో నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలను సెప్టెంబర్ 17, 2022 నుండి రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నామని వారు గుర్తు చేశారు. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవాలు ఆ త్యాగధనులందరినీ స్మరించుకోవడానికి మంచి అవకాశం. కావున తెలంగాణా ప్రజలకు వివిధ కార్యక్రమాలు, పోరాట యోధుల చరిత్ర ద్వారా స్వాతంత్ర్య స్ఫూర్తి, ప్రేరణ ను అందించి దేశభక్తిని మేల్కొల్పడం ప్రయత్నమే ఈ ఉత్సవాలు అని వారు వివరించారు.

ప్రముఖులు మాట్లాడుతూ బానిసత్వ పాలనలో ప్రజలు వారి చరిత్ర చరిత్ర ఆవశ్యకత ను తెలియచేస్తూ చరిత్ర మరచిన సమాజం భవిత అంధకారం అని వారు అభిప్రాయపడ్డారు. కూకట్ పల్లి జిల్లా ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులుగా రావుస్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ పొలసాని ప్రభాకర్ రావు, జిల్లా ఉత్సవ సమితి కార్యాధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త, భారత వికాస్ పరిషత్ సభ్యులు చింతపట్ల అనిల్ కుమార్ ఈ అమృతోత్సవాల సందర్భంగా సంవత్సరం పాటు జరగబోయే కార్యక్రమాల విస్తృత సమాచారాన్ని, యోజనను తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ కూకట్ పల్లి భాగ్ అధికారులు  సంఘచాలకులు సుభాష్ చంద్ర బోస్, సికింద్రాబాద్ విభాగ్  కార్యవాహ భరతపుడి శ్రీనివాస్, కూకట్ పల్లి భాగ్ కార్యవాహ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాల వివరాలు

నవంబర్ 2022 లో యువకులు, కళాశాల విద్యార్థులతో యువ సమ్మేళనం

జిల్లా లోని అన్ని బస్తిలలోని లక్షలలాది  కుటుంబాలకు తెలంగాణ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని ప్రేరణను జనజాగరణ ద్వారా తెలియచేయడానికి ప్రయత్నం.

ప్రతిష్ఠిత వ్యక్తులు, మేధావులతో అన్నినగరాలలో  సదస్సులు

17 సెప్టెంబర్ 2023 న బస్తిలలో త్రివర్ణపతాక వందనం తో నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు విజయవంతముగా పూర్తి

Related posts

ఢిల్లీ వెళ్లి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

Satyam NEWS

బర్డ్ ఫ్లూ: కరోనా తో పాటు చైనా లో బర్డ్ ఫ్లూ కూడా

Satyam NEWS

మాదిగ జర్నలిస్టు జాతీయ మహాసభను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment