ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు తీవ్ర గాయాలు పాలు కాగా మరో వ్యక్తి స్వల్ప గాయాలైన ఘటన బుధవారం ఉదయం చోటు దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి .
వరంగల్ డిపోకు చెందిన అంకన్నగూడెం బస్సు ఈరోజు ఉదయం జంగాలపల్లి ములుగు బస్టాండ్ నుండి జంగాలపల్లి మీదుగా వెళ్తుంది.
ఈ క్రమంలో జంగాలపల్లి కాసిం దేవి పేట కు మధ్యలో ప్రకృతివనం దగ్గర్లో ప్రమాదం జరిగింది జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంపై ముందుకు వస్తున్నారు
ఈ క్రమంలో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో ఒకరు కి తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయినాయి. కాగా తీవ్ర గాయాలు వ్యక్తులను ములుగు ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.