తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 342 వ రోజుకు చేరుకుంది.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, కళ్ళం రాజశేఖర రెడ్డి, పలగాని సాంబశివరావు, పఠాన్ జానీ ఖాన్, గుంటక సాంబిరెడ్డి, ఉయ్యురు శ్రీనుబాబు, మన్నవ సుబ్బారావు, మాదల లక్ష్మీనారాయణ, కళ్ళం రామిరెడ్డి, పాలెపు శ్రీహరి, రైతులు పాల్గొన్నారు.