40.2 C
Hyderabad
May 6, 2024 18: 24 PM
Slider కరీంనగర్

సంక్రాంతి రద్దీకి ఆర్టీసీ సమాయత్తం కావాలి

#RTC

కరీంనగర్ బస్ స్టేషన్ ను టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బస్సులను నడపాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు అందించాలని,

మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. అనంతరం బస్ స్టేషన్ వద్ద దుకాణ సముదాయాలను తనిఖీ చేశారు. ప్రయాణికుల కోసం వేచి ఉండే ప్లాట్ఫాములను పరిశీలించారు. ప్రయాణికులను, అధికారులను బస్ స్టేషన్ వద్ద బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

టిఎస్ఆర్టిసి సంస్థను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ప్రయాణికులకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఈడి కరీంనగర్ జోన్ వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్ కుసురుత్ ఖాన్, డిపో మేనేజర్ మల్లయ్య, పర్సనల్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జాతీయ జెండాలో కూడా కమర్షియల్ ఆలోచనలు చేస్తే ఎలా?

Satyam NEWS

పుట్టిన రోజు సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రభుదాస్‌

Satyam NEWS

వనపర్తిలో ఘనంగా వాసవిమాత ఆత్మార్పణ వేడుకలు

Satyam NEWS

Leave a Comment