ఆర్టీసీ కార్మికుల పై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానానికి నిరసన గా కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద యన్.ఎం యూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ దీక్ష లో ఆర్టీసి ఉద్యోగులు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 128 డిపోలు, నాలుగు వర్క్ షాపుల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ వ్యతిరేక విధానాలకు ఈ నిరసన తెలియ జేశారు. విలీన కమిటీ నివేదిక ఆధారంగా కాకుండా ఆర్టీసీ కార్మికుల విధులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం తగదన్నారు.