సినిమా ధియేటర్లు తెరుచుకున్నాయి. దాదాపు తొమ్మిది నెలల కరోనా హాలిడేస్ తర్వాత తెరుచుకున్న సినిమా ధియేటర్లకు రావడానికి చాలా మంది భయపడుతూనే ఉన్నారు.
ఆ భయాన్ని పోగొట్టేందుకు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ ధియేటర్ లో సినిమా చూసే అలవాటు మళ్లీ చేసుకోమని చెబుతున్నాడు.
సాయి ధరమ్ తేజ్ ఇంట్లో నుంచి బయలు దేరి సినిమా ధియేటర్ వరకూ వెళ్లే వరకూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ ఒక లఘు చిత్రాన్ని రూపొందించారు.
చేతులకు శానిటైజర్ రాసుకుని, నోరూ ముక్కు కవర్ అయ్యే విధంగా మాస్క్ పెట్టుకుని సినిమాలకు వెళ్లాలని సుప్రీమ్ హీరో ప్రేక్షకులకు సందేశాన్నిచ్చాడు.