34.2 C
Hyderabad
May 10, 2024 14: 51 PM
Slider పశ్చిమగోదావరి

సాయిబాబా స్తూపం 24 వ వార్షికోత్సవ వేడుకలు

#pedavegi

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్ లో సాయిబాబా స్తూపం 24 వ వార్షికోత్సవ  వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్షికోత్సవ వేడుకల నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల మనోభావాలకు ఆటంకాలు ఏర్పడకుండా మరో ప్రక్క శాంతి భద్రతలు పరిరక్షిస్తూ పెదవేగి ఎస్ ఐ టి సుదీర్, పెద్దపాడు ఎస్ ఐ జ్యోతి బసు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

సుమారు 25 ఏళ్ల నాడు సాయి బాబా ఆలయం తో బాటు 100 అడుగుల సాయి బాబా స్తూపం నిర్మితమైనది. రాష్ట్ర నలు మూలల నుండి వచ్చి ఈ స్థూపాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రతిష్టించిన సాయిబాబా పాదాలు తాకి  తన్మయత్నమౌతారు. ఇందుకోసం సాయిబాబా భక్తులు మైళ్ళ దూరం నుండి కాలి నడకతో వచ్చి బాబా ని దర్శించి స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి సాయిబాబా మందిరం లో సేద తీరి తనువంతా బాబా ఆధ్యాత్మికత నింపుకుని బాబా సన్నిధిలో తరించిపోతారు. ఒక్కసారి ఈ స్తూపం ను స్పృజిస్తే జన్మ దాన్యమౌతుందని భక్తులు చెప్పుకుంటారు.

Related posts

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసిఆర్ అహంకారాన్ని వీడాలి

Satyam NEWS

Red Alert: ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరంతో మహిళ మృతి

Satyam NEWS

మద్యం షాప్ కార్మికుల సమస్యలపై 28 న రాష్ట్ర బంద్

Satyam NEWS

Leave a Comment