పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్ లో సాయిబాబా స్తూపం 24 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్షికోత్సవ వేడుకల నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల మనోభావాలకు ఆటంకాలు ఏర్పడకుండా మరో ప్రక్క శాంతి భద్రతలు పరిరక్షిస్తూ పెదవేగి ఎస్ ఐ టి సుదీర్, పెద్దపాడు ఎస్ ఐ జ్యోతి బసు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
సుమారు 25 ఏళ్ల నాడు సాయి బాబా ఆలయం తో బాటు 100 అడుగుల సాయి బాబా స్తూపం నిర్మితమైనది. రాష్ట్ర నలు మూలల నుండి వచ్చి ఈ స్థూపాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రతిష్టించిన సాయిబాబా పాదాలు తాకి తన్మయత్నమౌతారు. ఇందుకోసం సాయిబాబా భక్తులు మైళ్ళ దూరం నుండి కాలి నడకతో వచ్చి బాబా ని దర్శించి స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి సాయిబాబా మందిరం లో సేద తీరి తనువంతా బాబా ఆధ్యాత్మికత నింపుకుని బాబా సన్నిధిలో తరించిపోతారు. ఒక్కసారి ఈ స్తూపం ను స్పృజిస్తే జన్మ దాన్యమౌతుందని భక్తులు చెప్పుకుంటారు.