42.2 C
Hyderabad
May 3, 2024 18: 54 PM
Slider ఆధ్యాత్మికం

ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు

#indrakeeladri

ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు సూచించారు.

ఇంద్రకీలాద్రిపై సోమవారం నిర్వహించిన దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యుల సమావేశంలో సోమినాయుడు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పణకు వచ్చే భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులకు బ్రాహ్మణ వీధిలోని ఉద్యోగుల కార్యాలయ ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.

మూడు రోజుల పాటు నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు దాతలు, రైతులు, వ్యాపార వర్గాల వారి నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరించేందుకు దేవస్థానం తరపున ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

అవసరమైన పక్షంలో కూరగాయలను దేవస్థానం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు శివప్రసాదశర్మ, శ్రీనివాసశాస్త్రి, పాలకమండలి సభ్యులు దుర్గాప్రసాద్, కృష్ణప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

వన్య ప్రాణిని కాపాడిన నారాయణపేట రైతులు

Satyam NEWS

రాష్ట్ర స్థాయిలో విజేతలైన నిర్మల్ జిల్లా దివ్యాంగులకు సన్మానం

Satyam NEWS

టీడీపీ అంటే చంద్రబాబు దోచుకున్న పార్టీ

Satyam NEWS

Leave a Comment