38.2 C
Hyderabad
April 29, 2024 19: 02 PM
Slider విజయనగరం

టీడీపీ అంటే చంద్రబాబు దోచుకున్న పార్టీ

#kolagatla

రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని  డిప్యూటీ స్పీకర్ ,విజయనగరం  ఎమ్మెల్యేకోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదని అన్నారు. అవాకులు,చవాకులు మాట్లాడుతూ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎన్టీ రామారావు అయితే,ఆ పార్టీ ని బలవంతంగా లాక్కొని పబ్బం గడుపుతున్న పరిస్థితి చంద్రబాబు దని అన్నారు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మ  తప్పకోవడం వల్ల టీడీపీ కి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించి పాదయాత్రలు చేస్తున్న సమయంలో ఆమెకు అండగా నిలవాలని విజయమ్మ పార్టీకి రాజీనామా చేశారని అన్నారు.రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తమ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఆ రోజున టిడిపి అధ్యక్షుడు అచ్చం నాయుడు పార్టీకి, కార్యాలయానికి శాశ్వతంగా తాళాలు వేసుకోవచ్చని హితవు పలికారు.

వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం సజావుగా సాగకూడదన్న దుర్బుద్ధితో వరుణ దేవునికి పూజలు చేసిన వైనం తెలుగుదేశం పార్టీదని దుయ్యబట్టారు. వర్షం కురిసినా జన ప్రవాహం ముందు వర్షం అడ్డంకి కాలేదన్న విషయాన్ని చంద్రబాబు అండ్ కో గ్రహించాలని అన్నారు.

రాష్ట్రంలో ప్రజలకు ఓట్లు అడిగే హక్కును తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్న 23 స్థానాలను కూడా కైవసం చేసుకుని 175 స్థానాల్లో గెలుపొందాలని లక్ష్యంతో పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

తమ ప్రభుత్వం ప్రజా రంజికంగా పాలన సాగిస్తుంది గనకనే రెండున్నరేళ్ళ తర్వాత  నేరుగా ప్రజల చెంతకే వెళ్తున్న పరిస్థితి గమనించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల బ్రహ్మ రధం పడుతూ ఆదరిస్తున్నారని అన్నారు.

టీడీపీ చేపడుతున్న సమావేశాలకు కార్యకర్తలను సమీకరించుకోవడానికే ఎంతో కష్టపడాల్సి వస్తుందన్న విషయాన్ని తాము గమనిస్తున్నామన్నారు. వైసిపికి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఉంటారన్నది తమ పార్టీ వ్యక్తిగత విషయమని అన్నారు.

ఈ విషయంలో చంద్రబాబు మాటలు సరికాదని అన్నారు. కష్టపడి స్థాపించుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే,  తెలుగుదేశాన్ని దోచుకునే పార్టీ చంద్రబాబుదని ఆరోపించారు…డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.

Related posts

పెరిగిన ధరలు తగ్గించే వరకు పోరాటం

Murali Krishna

సాధికారత అంటూనే ద‌ళితుల ప‌ట్ల వివ‌క్ష‌: ఎంపీ కోమ‌టిరెడ్డి

Satyam NEWS

గ‌రుడ‌ వాహనంపై ఒంటిమిట్ట శ్రీ కోదండ‌‌రాముడు

Satyam NEWS

Leave a Comment