రాష్ట్ర వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన దివ్యాంగుల ఆటల పాటల పోటీల్లో రాష్ట్ర స్థాయి లో విజయం సాధించిన కొండూరు అంజి మరియు రాహుల్ అహ్మద్ లను నిర్మల్ జిల్లా జాయింట్ కలెక్టర్ హేమంత్ బోర్కాడే, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కే. విజయలక్ష్మి సన్మానించి అభినందనలు తెలపడం జరిగింది.
రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీలలో నిర్మల్ జిల్లాకు చెందిన వారికి బహుమతులు రావడం చాలా సంతోషంగా ఉందని, మీ విజయంతో దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం నింపారని జాయింట్ కలెక్టర్ తెలపడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ కు సంబంధించిన సీనియర్ అసిస్టెంట్ -విద్యాసాగర్, జూనియర్ అసిస్టెంట్ మూర్తి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్- మధుసూదన్ రెడ్డి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్-నిరంజన్ రెడ్డి, ఫయాజ్, జిల్లా స్పోర్ట్స్ పర్సన్-రాజారత్నం మరియు తదితరులు పాల్గొన్నారు