బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేని ఈ కేసు విచారణ నుంచి తప్పించారు.
ఆర్యన్ను విడిచిపెట్టడానికి ముడుపులు అడిగారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్యన్ డ్రగ్స్తో సహా ఆరు కేసుల్ని ముంబై జోన్ నుంచి ఢిల్లీలోని ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ కేసుల్ని విచారించడానికి ఎన్సీబీ సీనియర్ అధికారి సంజయ్ సింగ్ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్, నటుడు అర్మాన్ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి.