మల్దకల్లు జాతర సందర్భంగా స్వయంభు శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఎఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి నేడు సందర్శించుకున్నారు. అదే విధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మండల అధ్యక్షులు కూడా తిమ్మప్ప స్వామిని దర్శించుకుని నడిగడ్డ ప్రజలు ఆయురారోగ్యాలతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారిని ఘనంగా సన్మానించి శాలువాలతో సత్కరించారు.
వీరి వెంట రాష్ట్ర ఓబిసి కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి వడ్డేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ఐజ కౌన్సిలర్ గిత్తల దేవరాజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బల్గేరా నారాయణరెడ్డి అలంపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, మల్దకల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్లారెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు నాగరాజు, ఉండవెల్లి మండల అధ్యక్షుడు గోపాల్ సర్పంచ్ శేశన్ గౌడ్ సెరుపల్లి సర్పంచ్ నాయుడు చిన్న
అముదలపాడ్ సర్పంచ్ నగేష్ మార మునగాల నర్సం గౌడ్ ఉండవల్లి మండల అధ్యక్షుడు గోపాల్ రామ చారి రాజనందం ఐజ మండల అధ్యక్షుడు జయ్యాన్న మద్దిలేటి అలంపూర్ మండల అధ్యక్షుడు రాము కొంకల్ యోగి రెడ్డి రుక్మాంత్ రెడ్డి జయరమి రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.