28.7 C
Hyderabad
April 28, 2024 05: 41 AM
Slider గుంటూరు

మాచర్ల ఘటన భయానకం: నవతరంపార్టీ

#Raosubrahmanyam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని దానికి నిదర్శనం మాచర్లలో నిన్న రాత్రి జరిగిన సంఘటనలు నిదర్శనం అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. మాచర్లలో అసాంఘిక శక్తులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడి భయానకంగా వ్యవహరించాయన్నారు.

గతంలో చిలకలూరిపేట నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉండేదని, కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా పల్నాడు జిల్లాలో కలిపారని, మాచర్ల ఘటన వలన పల్నాడు జిల్లాలో ఉన్నందున భయంకలుగుతుంది అని,శాంతిభద్రతలు లేని పల్నాడు జిల్లా నుండి చిలకలూరిపేట నియోజకవర్గాన్ని తప్పించి గుంటూరు జిల్లాలో కలపాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు రావుసుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.

ముందు ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మాచర్ల ఘటన గురించి గవర్నర్ స్పందించాలని లేఖలో పేర్కొన్నారు.

Related posts

కరోనా చంపేస్తుంది బయటకు రాకండి మహాప్రభో..

Satyam NEWS

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములుకు పోలీసుల నివాళి

Sub Editor

ఇష్టానుసారంగా ఈ- చలానా విధిస్తున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment