29.7 C
Hyderabad
May 2, 2024 06: 46 AM
Slider ప్రత్యేకం

ఎమ్మెల్సీ ఎర చూపి టీడీపీ నేతలకు గాలం

#jagan

రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతున్న తెలుగుదేశం పార్టీని బలహీన పరిచేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త ప్లాన్ వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న నాయకులను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు పథకం సిద్ధం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఆపరేషన్ ఆకర్ష్’’ ద్వారా మాత్రమే తెలుగుదేశం పార్టీని బలహీన పరచగలమని ఒక అంచనాకు వచ్చిన వైసీపీ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కొందరు తెలుగుదేశం పార్టీ నేతలను ఎంపిక చేసుకున్నట్లు కూడా తెలిసింది.

వైసీపీకి 16 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్న నేపథ్యంలో టీడీపీ నుండి వైకాపా కి వచ్చే నాయకులకు 8 నుండి 10 సీట్లు కేటాయించినట్లు చెబుతున్నారు. కర్నూలు లో రెండు పెద్ద కుటుంబలతో ఇప్పటికే వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కె.ఈ ఫ్యామిలీ లో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు, మరొకరికి ఎమ్మెల్యే ఇచ్చేందుకు చర్చలు జరిగినట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే టిక్కెట్ తో బాటు పోటీ చేసేందుకు అర్ద బలం కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరో వైపు కోట్ల ఫ్యామిలీ లో ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి ఎంపీ లేదా ఎం.ఎల్.ఏ టికెట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఉమ్మడి చిత్తూరు నుండి ఒకరికి, నెల్లూరు లో ఓ మైనారిటీ నేతకు, కడపలో ఇద్దరికి, ఉత్తరాంధ్ర లో మరో ఇద్దరు బడా టీడీపీ నేతలకు ఎమ్మెల్సీ ఆఫర్లు ఆశ చూపి వైకాపా లోకి ఆహ్వానించాలని భారీ స్కెచ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Related posts

పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ను బిసిలకు కేటాయించాలి

Satyam NEWS

ఫోన్ కొనివ్వలేదని తల్లిని హత్యచేసిన కొడుకు

Sub Editor 2

పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం

Satyam NEWS

Leave a Comment