40.2 C
Hyderabad
April 29, 2024 18: 30 PM
Slider పశ్చిమగోదావరి

పట్టించుకునే నాథుడు లేక అనాథలా మారిన గురుకుల పాఠశాల

#balayogigurukulam

ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వాట్లూరు బాలయోగి గురుకుల పాఠశాల పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నది. నేడు నిర్వహించిన పేరెంట్స్ సండే కూడా సౌకర్యాలు లేకపోవడంతో అభాసుపాలైంది. అందరు ఎండలో నిలబడి తమ పిల్లలకు భోజనాలు వడ్డిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో ఎటువంటి వసతులు లేవని ఎమ్మెల్యే వచ్చి చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేరెంట్స్ సౌకర్యాల గురించి ప్రశ్నిస్తున్నారని సంబంధిత అధికారులు ఫోన్లు స్విచాఫ్ చేసుకుని ఫోన్ ఎత్తకుండా ఉంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు ఉన్న దగ్గర లోనే ఉన్నా పారిశుద్ధ్య లోపం కనిపిస్తున్నది. పిల్లల్ని దగ్గర   కూర్చోబెట్టి పక్కన కరెంటు స్తంభం కూడా ఉండటం అక్కడే భోజనం చేయాలని టీచర్స్ అంటున్నారని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి తగిన న్యాయం చేయాలని తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

వెంకట రమణారెడ్డిని ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS

మాజీ హోం మంత్రి నాయినికి ఘన నివాళులు

Satyam NEWS

ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై రైతులు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment