రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ స్పూర్తితో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిగి కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డి ప్రారంభించారు. మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాల సంతోషంగా ఉన్నదని విద్యార్థులు, ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని సీతారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక MLA మహేశ్ రెడ్డి సతీమణి ప్రతిమ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్,స్థానిక జడ్పిటిసి పట్లొల హరి ప్రియ, నియోజక వర్గ టీఆరెస్ అధ్యక్షుడు మధుసూధన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
previous post