రామంతాపూర్ డివిజన్ లో దీర్ఘకాలిక సమస్యలపై ఉప్పల్ డీసీ అరుణకుమారి, ఈ ఈ నాగేందర్లాల్లను మాజీ కార్పోరేటర్ గంధం జోత్న్సనాగేశ్వరరావు బుదవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ రామంతాపూర్ డివిజన్లోని సుమారు మూడు కోట్ల రూపాయల పనులు శాక్షన్ అయి పెండిరగ్ లో ఉన్నాయని, మంజూరి పనులను వెంటనే ప్రారంభించాలని డీసీ కి వివరించారు. డీమార్టు లైన్లో బీటీ రోడ్డు, రామ్శంకర్నగర్ రక్తమైసమ్మగుడి దగ్గర సీసీ రోడ్డు, వాసవీనగర్ స్ట్రీట్ నెంబర్ 1లో సీసీ ,ఇంద్రానగర్ శేకర్ బస్తీలో సీసీ రోడ్డు, శాంతినగర్లో డ్రైన్ లైన్, కామాక్షిపురం స్ట్రీట్ నెం.6,8, లలో రెయిన్ వాటర్ లైన్ , రాజేందర్నగర్ కమిటీహాల్ మరియు గ్రేవీవార్డు డవలప్మెంటు, శారదానగర్ ఏడీఆర్ఎం గల్లి నుంచి ఓల్డ్ రామంతాపూర్ వరకు బీటీరోడ్డు ఇట్టి పనులు మంజూరి అయి పెండిరగ్లో ఉండటం వలన డివిజన్ వాసులు ఇబ్బంది పడుతున్నారని డీసీ కి మాజీ కార్పోరేటర్ గందం జోత్న్సనాగేశ్వరావు తెలిపారు. డీసీ సానుకూలంగా స్పందించి సంబదిత అధికారి ఈ ఈ నాగేందర్ తో మాట్లాడి వారం రోజులలో పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ఈ నాగేందర్ మాటాలడతూ తక్షణమే పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
previous post