31.7 C
Hyderabad
May 2, 2024 10: 13 AM
Slider ముఖ్యంశాలు

కండ బలం, డబ్బు బలం లేకుండా దేశాన్ని పాలించిన పివి

#Mallu Bhatti Vikramarka

కండబలం, ధనబలం లేకుండా ఒక వ్యక్తి ఈ సువిశాల దేశాన్ని పాలించగలడు అని నిరూపించిన వ్యక్తి  పివి నరసింహారావు అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

ఈరోజు గాంధీభవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు గారి శత జయంతి వేడుకల్లో ముఖ్య అతిధి గా పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ని చేసిన ఇందిరా గాంధీ పి.విని కేంద్రానికి తీసుకువెళ్లి ఉన్నతమైన కేంద్ర మంత్రి పదవులను ఇచ్చారని గుర్తు చేశారు.

తరువాత రాజీవ్ గాంధీ మానవవనరులు అనే కొత్త శాఖను ప్రవేశపెట్టి దానికి పి.విని మంత్రిని చేశారని అన్నారు. దేశంలో విద్యావ్యవస్థ కి కొత్త మార్గాన్ని  పి.వి ద్వారా బాటలు వేశారని, రాజీవ్ గాంధీ  మరణాంతరం దేశ ప్రధానిగా పదవిని పి.వి నరసింహారావు చేపట్టారని అన్నారు. ప్రధానిగా ఆర్ధిక సంస్కరణలు చేపట్టి నేడు ఈ దేశాభివృద్ధి కి కారణం అయ్యారని మల్లు అన్నారు.

Related posts

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

Satyam NEWS

పరాన్న జీవి- రామ్ గోపాల్ వర్మ- పవర్ స్టార్

Satyam NEWS

ఫోనిక్స్ పెయింటింగ్, ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment