వైసిపి నాయకుల ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములు కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి (వాసు) కడప సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కడప జిల్లాలో వైసీపీ నాయకులు అధికార దాహంతో ప్రభుత్వ స్థలాలను ఇష్ట రాజ్యంగా భూ కబ్జాలు చేస్తున్నారని అన్నారు.
సామాన్య ప్రజల భూములు ఆన్లైన్ లో ఎక్కిచడంలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. జిల్లా లో అనేక భూములు కబ్జాలకు గురవుతున్నాయని ప్రభుత్వ భూములను కబ్జాలకు గురి కాకుండా చూడాలని అన్నారు.
వైసీపీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొడ్తున్నారని అన్నారు.