సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి సందర్బంగా జిల్లా లోని అన్ని పాఠశాలల్లో రేపు “రాష్ట్రీయ ఏక్తా దివస్ “వేడుకలు నిర్వహించాలని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి కోరారు.
ఆ రోజు తప్పకుండా ప్రతి పాఠశాల లో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ నిర్వహించాలని ఆదేశించారు.
Covid-19 నిబంధనలను పాటిస్తూ ఈ వేడుకలు జరిపి నివేదిక ను ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలని కోరారు.
పాఠశాల వారీగా ఫోటోలను కూడా పంపాలని కోరారు. MEO లు మండల స్థాయి లో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు సముదాయ స్థాయిలో కార్యక్రమం ను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
CRP లు వారి పరిధిలో ని పాఠశాల లో కార్యక్రమం జరిగేలా చూడాలని , సమాచారం మండల విద్యా కేంద్రం లో అందచేయాలని కోరారు.