31.7 C
Hyderabad
May 2, 2024 09: 08 AM
Slider కడప

విద్యారంగాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి

kadapa school

శనివారం నగరంలోని వైస్సార్ మెమోరియల్ ఆడిటోరియం లో రుషి వ్యాలీ,జాహ్నవి హాపీ హౌవర్స్ ప్లే స్కూల్ 25 వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.

ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నత చదువులు చెప్పించడంతో పాటు పోటీ ప్రపంచంలో ముందుండేలా తీర్చి దిద్దేలా కృషి చేస్తున్నారని అన్నారు. 25 ఏళ్లుగా విద్యనందిస్తున్న రుషి వ్యాలీ స్కూలు నిర్వాహకులను అభినందించారు. స్కూల్ ప్రాజెక్టులు ఏవైనా ఉంటే తీసుకొస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రాజేశ్వరి, కరస్పాండెంట్ వెంకట కిషోర్, ప్రిన్సిపాల్ ఇందిరా సింగస్వామి, విదేశీ విద్యా ప్రముఖులు అల్సన్ వాట్సాన్, షరాన్, ప్రసన్న రామ పాల్గొని విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్య రూపకాలు అలరించాయి.

Related posts

అమరావతి రైతుల డిమాండ్ ను అపహాస్యం చేసిన సీఎం జగన్

Satyam NEWS

వనపర్తిలో ఆర్యవైశ్య మహిళ హత్య కేసులో 5గురు అరెస్టు

Satyam NEWS

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ పై చిత్త శుద్ధి లేదు: రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment