రాష్ట్రంలోఎస్సీ, ఎస్టీ, బిసిమైనార్టీ విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష అయిందని టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు.
ఈ పరిస్థితికి కారణమైన జీవో నెం.77 ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యాశాఖ మంత్రి కి వారి శాఖపై సరైన అవగాహన లేదు..ఆయన ఒక రబ్బర్ స్టాంప్ మాత్రమేనని ప్రణవ్ గోపాల్ అన్నారు. జగన్ ఫేక్ సిఎమ్ గా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేక వ్యవహరిస్తున్నప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఈ నెల 22 న సిఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన వెల్లడించారు.