గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న మొదటి విడత ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆశావాహులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడం పట్ల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 30వ తేదీ వరకు నామినేషన్లు ఆశాజనకంగా ఉన్నాయి.
అయితే 31వ తేదీ ఆఖరి తేదీ కావడంతో మరిన్ని ఎక్కువ సంఖ్య లో నామినేషన్లు వేసే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
మొదటి విడత ఎన్నికల కోసం జనవరి 29 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.