సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ నిర్వహించే కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని నాగర్ కర్నూల్ జిల్లా డిఆర్ ఓ మధుసూదన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్ జాతీయ ఓటరు దినోత్సవం పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు,ఉద్యోగులు ఉదయం 10:30 గంటల వరకు హాజరు కావాలన్నారు.
జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాని నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం నిర్ణయించిందని ఆదివారం తెలిపారు.
18 ఏళ్లు నిండిన యువత ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు అధికారుల కృషి ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేరు ఉన్నదీ,లేనిదీ చూసుకోవచ్చు అన్నారు.
ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని డి ఆర్ ఓ మధుసూదన్ నాయక్ కోరారు.