38.2 C
Hyderabad
April 27, 2024 18: 14 PM
Slider మహబూబ్ నగర్

జాతీయ ఓటర్ల దినోత్సవానికి అధికారులు హాజరు కావాలి

#NagarKarnoolRDO

సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా  నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్  నిర్వహించే కార్యక్రమానికి  జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని నాగర్ కర్నూల్  జిల్లా డిఆర్ ఓ మధుసూదన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 

జిల్లా కలెక్టర్  జాతీయ ఓటరు దినోత్సవం పై అవగాహన  కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు,ఉద్యోగులు  ఉదయం 10:30 గంటల వరకు హాజరు కావాలన్నారు.

జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాని నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం నిర్ణయించిందని ఆదివారం తెలిపారు.

18 ఏళ్లు నిండిన యువత ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు అధికారుల కృషి ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఓటరు నమోదుతో పాటు ఓటరు జాబితాలో పేరు ఉన్నదీ,లేనిదీ చూసుకోవచ్చు  అన్నారు.

 ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు  హాజరుకావాలని డి ఆర్ ఓ మధుసూదన్ నాయక్ కోరారు.

Related posts

ఆక‌ట్టుకుంటున్న ‘ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌’ ట్రైల‌ర్‌

Satyam NEWS

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం

Satyam NEWS

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

Leave a Comment