30.7 C
Hyderabad
April 29, 2024 05: 51 AM
Slider నల్గొండ

జర్నలిస్టులపై దాడులు అమానుషం

#WorkingJournalists

దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు చేయడం  అమానుషమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, కోలా నాగేశ్వరరావులు అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సిఐ రాఘవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైన దని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం జిల్లా నాయకులు తోట నర్సయ్య, టివీఎల్, దయాకర్ రెడ్డి.దేనంకొండ శేషం రాజు, పిల్లలమర్రి శ్రీనివాస్. దేవరం రాంరెడ్డి, కోదాటి గురవయ్య, వెంకటరెడ్డి.దేవపంగు బాబు,శివ, భిక్షం, సందీప్, అఖిలపక్ష పార్టీల నాయకులు పాలకూరి బాబు, తన్నీరు మల్లికార్జునరావు,

గుండు వెంకటేశ్వర్లుగౌడ్, ముస్కుల చంద్రారెడ్డి,బాల వెంకటేశ్వర్లు,  దేనంకొండ రామరాజు,అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, బాచిమంచి గిరిబాబు,గల్లా వెంకటేశ్వర్లు, నాగారపు పాండు, రేపాకుల మురళి, జేవీఎల్,

శీతల రోషపతి, ఎలక సోమయ్యగౌడ్, టిడిపి రాష్ట్ర నేతలు నలమాద శ్రీనివాస్ యాదవ్, బెల్లంకొండ రామజోగి ,ఎలిశెట్టి  గోపీనాథ్, రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపికి రాజీనామా చేసిన సునీల్

Satyam NEWS

హన్స్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరించిన ములుగు ఎస్పి

Satyam NEWS

మళ్లీ మళ్లీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు

Satyam NEWS

Leave a Comment