26.7 C
Hyderabad
May 3, 2024 09: 14 AM
Slider విజయనగరం

పట్టుబడిన 10 పశువులు పదిలంగా ఉన్నాయి…!

#cattle

విజయనగరం జిల్లా విజయనగరం రూరల్ పోలీసు స్టేషను పరిధిలో ఈ నెల 9న పట్టుబడిన 10 పశువులు పదిలంగా ఉన్నాయని విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావు తెలిపారు.  ఈ నెల 9న పట్టుకున్న 10 పశువులను తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చేంత వరకు వాటి సంరక్షణను బాధ్యతను విజయనగరం డీఎస్పీ ఉత్తర్వులు మేరకు ఒక రైతుకు అప్పగించామన్నారు.

ఇటీవల కాలంలో పోలీసులు పట్టుకొన్న పశువులను గోసంరక్షణ సమితికి అప్పగించగా, వాటిలో చాలా పశువులు మృతి చెందినట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టిస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పశువులు పట్టుబడిన వెంటనే విజయనగరం రూరల్ పోలీసులు

కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. కోర్టు వారు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వాటి సంరక్షణను రైతుకు అప్పగించి, అతని వద్ద నుండి కోర్టు వారు కోరినపుడు పశువులను హాజరుపర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అఫిడవిట్ ను తీసుకున్నట్లుగా విజయనగరం రూరల్ ఎస్ఐ పి.నారాయణరావు తెలిపారు.

Related posts

ఘనంగా అమృత లత అపురూప అవార్డుల ప్రదానోత్సవం

Satyam NEWS

బైంసా అల్లర్ల పై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి

Satyam NEWS

ఆనందం గా ఉండటం చాల ముఖ్యం

Satyam NEWS

Leave a Comment