ఈ నెల 7వ తేదీన నిర్మల్ జిల్లా బైంసా లో జరిగిన అల్లర్ల ఘటన లో విద్రోహ శక్తులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపు రావు అన్నారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులతో పాటు ఎంపీ సోయంబాపు రావు డీజీపీ మహేందర్ రెడ్డి ని కల్సి వినతి పత్రం సమర్పించారు. తన నియోజకవర్గమైన బైంసా లో తరచూ ప్రణాళిక బద్దంగా ఒక వర్గం విద్వేషాలు సృష్టిస్తూ దాడులు జరుపుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
అధికార తెరాస పార్టీ నాయకుల అండతో MIM నేతలు కుట్రలు పన్నుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని అన్నారు. త్వరలోనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి పరిస్థితిని వివరిస్తామని ఎంపీ సోయం బాపు రావు అన్నారు.