31.7 C
Hyderabad
May 2, 2024 07: 05 AM
Slider ముఖ్యంశాలు

దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల నుండి బంగారం పట్టివేత

#Shamshabad airport

గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో, ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగును, వ్యక్తులను స్కానింగ్ చేయడంతో వారి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

మహిళ ప్రయాణికురాలు బంగారం పేస్టును లో దుస్తులలో ఇన్నర్ కు ప్రత్యేకంగా ప్యాకెట్ ఏర్పాటు చేసుకొని అందులో రూ. 45,37,500 విలువచేసే 726 గ్రాముల బంగారం పేస్టు ఉంచగా కస్టమ్స్ అధికారులు మహిళ వద్ద స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడు చిన్నపిల్లలకు పాలు తాగించే పాల డబ్బాలో బంగారం ఆభరణాలను అమర్చుకొని తరలిస్తుంటే అతని వద్ద నుంచి రూ. 7 లక్షల 77 వేల 621 ల విలువ చేసే 127 గ్రా

ముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 53 లక్షల 15 వేల 121 ల విలువ చేసే 853 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని, ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రైతు బిడ్డనని చెప్పుకోవడానికి సంకోచించకండి

Satyam NEWS

రుధిరాంజలి వేసిన చిత్రాలేఖనానికి అధికారులు ఫిదా

Satyam NEWS

[Best] _ What Will Lower Your Blood Pressure Immediately High Bp Homeopathy Medicine How To Control Your High Blood Pressure Naturally

Bhavani

Leave a Comment