హైదరాబాద్ లోని అంబర్పేట నియోజకవర్గంలోని తులసి రామ్ నగర్ లంకలో పోలింగ్ బూత్ నెంబర్ 178.179.180.181 శక్తి కేంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శక్తి కేంద్రం ఇంచార్జ్ కె.అనిత అధ్యక్షత వహించడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8 సంవత్సరాల సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కరపత్రాలను అందజేశారు.
ఈ సమావేశమునకు ముఖ్యఅతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, గోల్నాక డివిజన్ ఇంచార్జి రాఘవ రెడ్డి, బిజెపి గోల్నాక డివిజన్ కన్వీనర్ మూల రవీందర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆర్ వి ఎల్ రమేష్, మహిళా మోర్చా నాయకురాలు శక్తి కేంద్ర ఇంచార్జి అనిత, బిజెపి సీనియర్ నాయకులు ఆర్.కె.రామచందర్, బద్రి, అంబోజిరాజు డి.రమేష్, బీజేపీ బూత్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బూత్ పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట