29.7 C
Hyderabad
May 1, 2024 11: 00 AM
Slider ప్రకాశం

రేపు ఒంగోలులో ఆత్మగౌరవ గర్జన సభ

#Bahujana AtmaGurava

రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హత్యలపై, అత్యాచారాలపై, శిరోమండనాలపై దాడులపై ‘పిడికెడు ఆత్మగౌరవం కోసం’ పేరిట ఒంగోలులోని మల్లు లింగయ్య గారి భవన్ లో శని వారం ఉదయం 10 గంటలకు ఆత్మగౌరవ గర్జన సభ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలిపారు. శుక్రవారం ఆయన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు .

డాక్టర్ సుధాకర్ నుండి డాక్టర్ అచ్చన్న వరకు, అబ్దుల్ సలాం నుంచి హజీరా వరకు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు . ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు మానభంగాలకు కేంద్రాలుగా మారాయని ధ్వజమెత్తారు .హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబును గజమాలలతో ఊరేగించారని, మాన్ ఈటర్ కు సభలు పెట్టడం వైకాపాకే చెల్లిందన్నారు .

ఆత్మగౌరవ సభలో సిపిఐ,సిపిఎం, టిడిపి, కాంగ్రెస్, జనసేన, ఆమ్ ఆద్మీ, జై భీం , లోక్ సత్తా, సిపిఐ ఎంఎల్, బిస్సీపీ, నవతరం నవక్రాంతి వంటి పార్టీ లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నాయకులు, అమరావతి జెఎసి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని బాలకోటయ్య వివరించారు.

Related posts

వయోలిన్ డే – అలరించిన వయోలిన్ కచేరీలు

Sub Editor

భారతీయులంతా గర్వించదగ్గ దర్శకుడు వసంత్ సాయి

Satyam NEWS

ప్ర‌కాశం బ్యారేజీకి భారీ వ‌ర‌ద‌నీరు: 25గేట్లు ఎత్తివేత‌

Satyam NEWS

Leave a Comment