31.2 C
Hyderabad
January 21, 2025 14: 19 PM
Slider ఖమ్మం

సెల్ఫ్ క్యారంటైన్: జనతా కర్ఫ్యూ లో ఉన్న మంత్రి పువ్వాడ

minister puvvada

నిత్యం ఎంతో మంది విజిటర్లతో బిజీగా ఉండే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జనతా కర్ఫ్యూను కచ్చితంగా పాటిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆయన అన్ని అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సెల్ఫ్ క్యారంటైన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశం మొత్తం జనతా బంద్ ను పాటిస్తున్నట్లే మంత్రి పువ్వాడ కూడా చేస్తున్నారు. ఉదయం నుంచి ఇంటి నుంచి బయటకు రాకుండా ఆయన నియంత్రణ పాటిస్తున్నారు. కేవలం 14 గంటలు కాకుండా 24 గంటల పాటు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలని సిఎం కేసీఆర్ చెప్పడంతో రేపు ఉదయం 7 గంటల వరకూ అధికార కార్యక్రమాలు లేకుండా మంత్రి పువ్వాడ చర్యలు తీసుకున్నారు.

Related posts

బీసీల కోసం 28 కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

ధరణి దరఖాస్తులు పరిష్కరించండి

Murali Krishna

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

Satyam NEWS

Leave a Comment